లంచ్ పార్టీలో చిరు-నాగ్-మహేష్-చరణ్
MB, Nag, Chiru at Maldives Private Party With Familiesఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కలిసి కనిపించినా, లేదంటే వారు పార్టీలలో సందడి చేసినా, కలిసి లంచ్ చేసినా, డిన్నర్ చేసినా అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరు-కింగ్ నాగార్జున-సూపర్ స్టార్ మహేష్-రామ్ చరణ్ కలిసి ఒకేచోట లంచ్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అదే పార్టీలో ఉపాసన, నమ్రత లు కనిపించడం చూసి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. అయితే వీరంతా కలిసి ఒకే టేబుల్ పై కూర్చుని ఫుడ్ తీసుకున్నాడో ఓ బిజినెస్ మ్యాన్ బర్త్ డే పార్టీలో అని తెలుస్తోంది. అది కూడా మాల్దీవుల్లో ఈ పార్టీ జరగగా..వీరంతా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లారని టాక్.
ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన, మహేష్, నమ్రత, చిరు, నాగ్ అందరూ కలిసి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కనిపించిన పిక్ ని ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
Mahesh Babu, Nagarjuna, Chiranjeevi at Maldives Private Party With Families








































