ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజా
Double bonanza for Prabhas fansఈరోజు ప్రభాస్ ఫాన్స్ కి డబుల్ బొనాంజా. ఎందుకో తెలుసా.. ఈరోజు ఆదివారం ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ఆడియన్స్ ముందుకు రాబోతుంది. స్టార్ మా నుంచి సలార్ ఈ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రసారం చెయ్యనున్నారు. మరి ఇది ప్రభాస్ ఫాన్స్ కి మంచి ట్రీటే కదా..!
ఇక రెండో స్పెషల్ ఏమిటో తెలుసా.. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో లో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం కల్కి నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈరోజు రాత్రి 7.15 నిమిషాలకి కల్కి నుంచి రిలీజ్ డేట్ అప్ డేట్ వస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంటే ఈరోజు ఆదివారం ప్రభాస్ ఫాన్స్ డబుల్ ట్రీట్ ని ఎంజాయ్ చెయ్యబోతున్నారు. సలార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో పాటుగా.. కల్కి రిలీజ్ డేట్ ప్రకటన తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.
Double bonanza for Prabhas fans on Today







































