ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Interesting News on Sarkaru Vaari Paata Movie

సర్కారు వారి పాటపై ఇంట్రెస్టింగ్ న్యూస్

మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ యమా జోరుగా సాగుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సముద్ర ఖని విలన్స్ గా కనిపించబోతున్నారనే న్యూస్ ఉంది. ఇక బ్యాంక్ కుంభ కోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట లో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడని, బ్యాంకు లను మోసం చేసి విదేశాలకు పారిపోయే బడాబాబులని అక్కడి నుండి తీసుకువచ్చి పనిష్మెంట్ ఇచ్చే యంగ్ కేరెక్టర్ లో మహేష్ చేయబోతున్నాడని అంటున్నారు. ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాపై ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే సర్కారు వారి పాటలో ఇంటర్వెల్ బ్యాంగ్ ని దర్శకుడు పరశురామ్ అదిరిపోయేలా ప్లాన్ చేసాడు అని, సింహాచ‌లం దేవాలయం నేప‌థ్యంలో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఉండబోతుందట. అంతేకాదు..  శ్రీ వ‌ర‌హాల‌క్ష్మీ నృసింహ వారి దేవ‌స్థానంలో సర్కారు వారి పాట  క్లైమాక్స్ ని దర్శకుడు ప్లాన్ చేసాడు అని, ఈ రెండు యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అని, ఇంటర్వెల్ బ్యాగ్ అయితే మహేష్ ఫాన్స్ కి గూస్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. మరి ఈ న్యూస్ తెలిసాక మహేష్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Sarkaru Vaari Paata update

Interesting News on Sarkaru Vaari Paata Movie
sakaru vaari paata movie
mahesh babu
mahesh sakaru vaari paata
mahesh - parasuram combo
keerthy suresh - mahesh combo
parasuram sakaru vaari paata
keerthy suresh sakaru vaari paata
highlight in sarkaru vaari paata