కొరటాల, జక్కన్నలని బెదిరించిన ఎన్టీఆర్
Koratala and Rajamouli special guests in Evaru Meelo Koteeswaruduయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రాజమౌళి, కొరటాలతో ఎంత మంచి సంబంధాలున్నాయో అందరికి తెలిసిందే. రాజమౌళి తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ చిత్రాలను చేసిన ఎన్టీఆర్ తాజాగా ఆర్.ఆర్.ఆర్ అనే పాన్ ఇండియా ఫిలిం చేసాడు. ఇక కొరటాలతో జనతా గ్యారేజ్ చేసిన ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. అత్యంత ఆత్మీయులైన జక్కన్న, కొరటాల ను ఎన్టీఆర్ తాను హోస్ట్ చెయ్యబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులకు గెస్ట్ లుగా ఆహ్వానించాడు.
సెప్టెంబర్ 20 న ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో రాజమౌళి, కొరటాల లే స్పెషల్ గెస్ట్ లు. అయితే షోకి అతిధులుగా వచ్చిన ఇద్దరిని సాదరంగా ఆహ్వానించిన ఎన్టీఆర్ కి రోల్ కెమెరా అని కొరటాల.. యాక్షన్ అని రాజమౌళి షాక్ ఇవ్వగానే ఎన్టీఆర్ ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటారు.. మాకేం వినిపిస్తుంది ఇక.. వీరికి ఆప్షన్ ఇవ్వకుండా ఆ ప్రశ్నని తీసెయ్యొచ్చా గురువుగారు అంటూ అనగానే.. అమాయకంగా కొరటాల, రాజమౌళి తప్పండి అలా చెయ్యకూడదు అని అంటారు. మరి.. ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది.. నేనే ఇక్కడ బాస్ ని అంటూ కొరటాల - రాజమౌళి ని ఎన్టీఆర్ బెదిరించిన ప్రోమో ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది.
Koratala and Rajamouli special guests in NTR EVaru meelo koteeswarudu game show








































