అరవ హీరోల ఆరాటం అందుకేనా?

ఇప్పుడు కోలీవుడ్ హీరోల కన్ను టాలీవుడ్ మీద పడింది. అక్కడి స్టార్ హీరోలే.. ఇక్కడి దర్శకనిర్మాతలతో సినిమాలు కమిట్ అవుతున్నారు. రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా ఫిలిం చెయ్యబోతున్నాడు. ఈలోపు అరవ హీరోలు టాలీవుడ్ మీదకి దండయాత్రకు దిగారు. అందులో ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా పాన్ ఇండియా ఫిలిం ని ప్రకటించాడు. ఇక నిన్నగాక మొన్న ధనుష్ శేఖర్ కమ్ములతో సినిమా ప్రకటించాడు. మరోపక్క సూర్య టాలీవుడ్ స్ట్రయిట్ మూవీ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది.
అయితే అరవ హీరోల తెలుగు సినిమాల ఆరాటం ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి పారితోషకాలు హై రేంజ్ లో ఉండడమేనట. విజయ్ - వంశి పైడిపల్లి మూవీకి విజయ్ ఏకంగా 100 కోట్లు దిల్ రాజు నుండి అందుకోబోతున్నాడనే న్యూస్ ఉంది. ఇక ధనుష్ కూడా తెలుగు నిర్మాతల నుండి మూడు భాషల కు కలిపి 50 కోట్లు తీసుకోబోతున్నాడట. మరి సూర్య - బోయపాటి మూవీకి సూర్య ఏకంగా 60 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే న్యూస్ మొదలైంది. చేసేవి పాన్ ఇండియా ఫిలిమ్స్.. అలా కూడా క్రేజ్ పెరుగుతుంది. అందుకే అరవ హీరోలు ఇలా పరభాషా దర్శకులకి కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట.
Vijay and Dhanush and Suriya charging whooping remuneration for their straight Tollywood debut movies
Kollywood heroes Huge Remuneration






































