ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూత

Senior Producer DoraswamyRaju Eyelid

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు సోమవారం ఉదయం కన్నుమూశారు. సోమవారం ఉదయం బంజారా హిల్స్ లోని ఓ హాస్పిటల్ లో గుండెపోటుతో దొరస్వామిరాజు కన్ను మూసారు. 1946 జులై 1 న చిత్తూరు జిల్లా కంట్రికలో జన్మించిన ఆయన టిటిడి బోర్డు సభ్యులుగా కూడా పని చేసారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని విఎంసి బ్యానర్ ద్వారా విడుదల చేసిన దొరస్వామి రాజు 500 సినిమాలకు పైగా పంపిణి దారునిగా వ్యవహరించారు. అంతేకాకుండా కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి లాంటి  10 చిత్రాలకు నిర్మాతగా పనిచేసారు. దొరస్వామిరాజు కన్నుముయ్యడంతో టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Senior Producer DoraswamyRaju no more

senior producer
doraswamy raju
no more