తెలంగాణలో థియేటర్లు బంద్..

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ మరింతగా పెరుగుతూంది. చైనాలోని వుహాన్ జంతువుల మార్కెట్ లో పుట్టిందని చెప్పబడుతున్న ఈ వైరస్ చాలా వేగంగా ప్రపంచ దేశాలకి వ్యాపించింది. చైనాలో కరోనా బారిన పడ్డ వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకి చేరువలో ఉంది. చైనా తర్వాత కరోనా వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ. ఇటలీలో ఈ వ్యాధి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనాలో కట్టడి చేస్తున్నా కూడా ప్రపంచ దేశాలకు చాలా ఫాస్ట్ గా ఈ వైరస్ విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా అన్ని దేశాలు మేల్కొన్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనదేశంలో కేరళలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా స్కూళ్ళు, కాలేజీలు సహా థియేటర్లని మూసివేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పద్దతి అవలంబిస్తున్నారు. కరోనా ప్రభావం రోజు రోజుకీ ఊహకి అందని రీతిలో పెరిగిపోతుండడంతో తెలంగాణ సర్కారు ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్ళు, థియేటర్లు ఈ నెల 31 వరకి మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. అసలే డ్రై మంత్ గా గడుస్తున్న మార్చ్ కరోనా కారణంగా పూర్తిగా డ్రైగా మారిపోయింది. ప్రభుత్వ నిర్ణయంతో చిత్ర నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీల్ని మార్పులు చేసుకుంటున్నారు.
Due to the effect of corona virus. Telangana state declared
Theatres shut down in Telangana






































