మహేష్.. రిజల్ట్స్ ముందేనా.. లేక?
Mahesh Babu Ready to His 20 Years Cine Celebrationsసూపర్స్టార్ మహేష్బాబు ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా మహర్షి చిత్రం చేశాడు. వీకెండ్లో కలెక్షన్లు బాగా ఉన్నాయి. ఇక అసలు విషయం సోమవారం నుంచి మొదలు కానుంది. బుధవారానికి ఈ చిత్రంపై ఓ క్లారిటీ వస్తుంది. ఇదే సమయంలో మహేష్ నటునిగా 20వ వసంతాన్ని జరుపుకుంటున్నాడు. ఈ రెండు విశేషాలను పురస్కరించుకుని విజయవాడలో భారీ వేడుక జరపాలని భావిస్తున్నారు. విజయవాడ వేదికగా నిలవడానికి కారణం నిర్మాతల్లో ఒకరైన పివిపితో పాటు మహేష్కి కూడా ఈ నగరం అంటే బాగా ఇష్టం. ఈ వేడుకను నెవర్ బిఫోర్ అనే స్థాయిలో జరపాలని భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడలోని కృష్ణానది తీరంతో పాటు లయోలా గ్రౌండ్స్ని కూడా పరిశీలిస్తున్నారు.
అయితే ఈ వేడుక ఎప్పుడు అనేది మాత్రం తెలియరావడం లేదు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం పోలీసులు అధికారులు బిజీబిజీగా ఉండనున్నారు. దాంతో 23 కంటే ముందే ఈ వేడుకను జరపాలంటే అది పోలీసులకు వీలు కాకపోవచ్చు. ఈవీఎంల వద్ద వారు పహారా కాస్తూ ఉన్నారు. మరి 23 తర్వాత ఈ వేడుకను జరపాలంటే అప్పటికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ‘మహర్షి’ లాంగ్ రన్ 23తో ముగిసినా ఆశ్చర్యం లేదు. కాబట్టి 23 తర్వాత జరిపితే అది ‘మహర్షి’ ప్రమోషన్స్కి, ప్రేక్షకులను థియేటర్లవైపు రప్పించేందుకు ఉపయోగపడదు. అంతకు లోపలే ఈ వేడుక జరిగితేనే ఫలితం ఉంటుంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘మహర్షి’టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నిజానికి ‘మహర్షి’ ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో జరపాలని భావించిన ఈవీఎంలు ఆ స్టేడియంలోనే ఉండటంతో పాటు పలు ఎన్నికల కారణాల వల్ల అది వీలు కాలేదు. ఇలా ఎన్నికల సెగ ‘మహర్షి’ని కూడా బాగా ఇబ్బంది పెడుతోంది. పైకి కనిపించని ప్రభావం ఈ చిత్రంపై పడుతోందనేది మాత్రం వాస్తవం.
Mahesh Babu 20Years Celebrations Update







































