స్థానబలం పెంచుకుంటున్న దిల్ రాజు
Dil Raju Preparing strong Ground in Telanganaమొసలికి నీళ్లలోనే బలం, అందుకే తన చుట్టూ నీళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. ఇది మనిషికి కూడా వర్తిస్తుంది. తాను ఉన్న పొజిషన్ ను బలపరుచుకునేందుకు తన చుట్టూ బలగాన్ని, పరపతిని పెంచుకుంటాడు. ఇప్పుడు దిల్ రాజు ఫాలో అవుతున్న ప్రొసెస్ కూడా ఇదే. ఆల్రెడీ తెలుగు చిత్రసీమలో ఒన్నాఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా మారిపోయిన దిల్ రాజు ఇప్పుడు తన స్థాయిని పెంచుకొనే పనిలో పడ్డాడు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలిగే దిల్ రాజు.. ఆ సన్నిహిత బంధాన్ని ఇప్పుడు బంధుత్వంగా మార్చుకుంటున్నాడు దిల్ రాజు.
తన నిర్మాణ వారసుడిగా ఆల్రెడీ ప్రకటించబడిన హర్షిత్ రెడ్డికి అధోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి కుమార్తె గౌతమితో వివాహం జరిపించనున్నాడు దిల్ రాజు. ఇది డెస్టీనేషన్ వెడ్డింగ్. ఆల్రెడీ దిల్ రాజు స్టాఫ్ డైరెక్టర్స్ అందరూ గోవా వెళ్ళిపోయారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాలుపంచుకొంటారు.
ఆల్రెడీ తెలంగాణ నిర్మాతగా మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్న దిల్ రాజు.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రభుత్వంతో బంధుత్వం కుదుర్చుకోవడంతో.. మరింత స్ట్రాంగ్ గా మారనున్నాడు.
ఇకపోతే.. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న మూడు సినిమాలు 2019లో విడుదలకానున్నాయి. మహేష్ బాబు మహర్షి, వెంకీ, వరుణ్ తేజ్ ల ఎఫ్2 చిత్రాలు ఇందులో కీలకమైనవి.
Dil raju is getting strong by each day with political connections and alliances







































