సచివాలయంలో జగపతిబాబుకు ఏంపని..?

ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన నటుడు జగపతి బాబు. 'లెజెండ్','నాన్నకు ప్రేమతో','శ్రీమంతుడు' వంటి చిత్రాలతో నెక్స్ట్ లెవెల్ కు ఎదిగాడు. తమిళంలో సైతం క్రేజీ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న జగపతి బాబు తాజాగా హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రత్యక్షమయ్యాడు. జగపతిబాబుకి సచివాలయంలో ఏంపని అనుకుంటున్నారా..?.జగపతి బాబు బ్యానర్ ఆవిష్కరణ ఆహ్వానాన్ని అందించడానికి మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు వెళ్ళాడు. అయితే కేటీఆర్ అందుబాటులో లేకపోవడం వలన ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ను కలిసి ఆహ్వాన పాత్రికను అందజేశారు. 

jagapathi babu
secretariat
it minister ktr
jayesh ranjan