వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నిర్మాత..!

నిర్మాత చినబాబు అలియాస్‌ రాధాకృష్ణ తన హారికి అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్‌శ్రీనివాస్‌-నితిన్‌ల కాంబినేషన్‌లో అ..ఆ చేస్తోన్న ఆయన నాగచైతన్య హీరోగా చందుమోండేటి దర్శకత్వంలో మలయాళ ప్రేమమ్‌ను తెలుగులో మజ్నుగా నిర్మిస్తున్నాడు. ఇక వెంకటేష్‌-నయనతారల కాంబినేషన్‌లో మారుతి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమకు ఇస్తే రెండుకోట్లు ఇస్తామని యువి క్రియేషన్స్‌ ఆఫర్‌ ఇచ్చినప్పటికీ రాధాకృష్ణ అలా ఇవ్వకుండా మూడు చిత్రాలను ఒకేసారి నిర్మించబోతున్నాడు. మొత్తానికి చినబాబు మరలా లైన్‌లోకి వచ్చి బిజీగా మారుతుండటంతో ఆయన సన్నిహితులు ఎంతో సంతోషంగా ఉన్నారు. 

radhakrishna
a aa movie
nagachaitanya
majnu movie
maruthi