పవర్‌స్టార్‌ కొరకు ఎదురుచూస్తున్నదిల్లీ తెలుగువారు!

ఎన్నికల ‘కురుక్షేత్రం’ ముంచుకొస్తోంది. పోటీ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలనేకాదు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేయడం ఖాయం. చిత్రమేమంటే అధికార బిజెపిని ఎదుర్కొంటోంది ప్రధానంగా జాతీయ పార్టీ కాంగ్రెసు కాదు. ఓ సామాన్యుడు ` కేజ్రీవాల్‌ ‘ఆమ్‌ ఆద్మీ’. ఈ ఎన్నికలలో ప్రతిఓటూ విలువైనదే. వందలు / ఒకటి రెండు వేల ఓట్ల తేడాతో పరాజితులు-విజేతలు బయటపడనున్నారు. దిల్లీలో తెలుగువారి సంఖ్య గణనీయంగానే వుంది. వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ సర్వశక్తులు ధారపోస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రచారానికి బయల్దేరకపోవడం ఆశ్చర్యంగా వుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోరులో పవర్‌స్టార్‌ పాల్గొనాలని దిల్లీలోని తెలుగువారు ఎదురుచూస్తున్నారు.

-తోటకూర రఘు

kejreeval
venkayyanaidu
powerstar pawan kalyan
chandrababu