ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో భగీరథ భారతమెరికా
Bhagiratha India America at the World Telugu Literary Conferenceప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో భగీరథ భారతమెరికా
సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కవి భగీరథ రచించిన భారతమెరికా పుస్తకం ఈ నెల 10వ తేదీన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆవిష్కరణ జరుగుతుంది .
అంతర్జాలం లో జరిగే ఈ ప్రతిష్టాత్మక సాహితీ సదస్సులో ప్రపంచంలో చాలా దేశాలు పాల్గొంటున్నాయి. భగీరథ రచించిన ఈ 14వ పుస్తకం భారతమెరికా ను అమెరికాలోని హ్యూస్టన్ లో నివసించే డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజుగారికి అంకితం ఇచ్చారు.
వంగూరి ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రధాన ఉపన్యాసంతో మొదలవుతుంది. భారత దేశంలో అక్టోబర్ 10న మధ్యాహ్నం 1:30లకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.
తరువాత భారతమెరికా పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. వి. రమణాచారి గారు ఆవిష్కరిస్తారు దర్శకులు ఎస్.వి కృష్ణా రెడ్డి గారు, నిర్మాత అచ్చి రెడ్డి గారు ప్రత్యేక అతిధులుగా పాల్గొంటున్నారు.
Bhagiratha India America at the World Telugu Literary Conference







































