ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Attempts to create disputes between parties

పార్టీల మధ్య వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు

Attempts to create disputes between parties

చింతా ప్రదీప్ మరియు పంచ్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేనల మధ్య వివాదాలు సృష్టించడానికి రానున్న ఎన్నికల్లో 2 పార్టీల కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే సంధ్య శ్రీధర్ రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరియు రాజ్ తెలుగు నెట్వర్క్ ని లీజుకి తీసుకుని నడుపుతున్న శ్రీధర్ రావు తో ఎప్పటినుండో వీరు కుమ్మక్కు అయ్యి చంద్రబాబు గారి మీద, పవన్ కల్యాణ్ గారిమీద, వారి కుటుంబ సభ్యుల పైన విపరీతమైన దుష్ప్రచారాన్ని అత్యంత దారుణంగా సోషల్ మీడియా లో దూషిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రవ్వంత రెడ్డి అని దూషించడంలో.. రేవంత్ రెడ్డి గారిపై  కూడా ఈ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ని సోషల్ మీడియా లో దారిణంగా దూషించడం వెనుక కూడా సంధ్య శ్రీధర్ చింతా ప్రదీప్ కి మరియు పంచ్ ల్రభాకర్ రెడ్డి లకు సూచనలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ దుష్ప్రచారాలను నమ్మించడం కోసం ప్రజల కష్టాలను ప్రభుత్వానికి వినపడేలా చెప్తున్న మీడియా సంస్థలకు చెందిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని, ఈనాడు రామోజీరావు గారిని, ABN వెంకట కృష్ణ గారిని, TV5 సాంబశివరావు గార్లను కూడా టార్గెట్ చేసి వారిపై వారికి ఉన్న ysrcp అనుకూల మీడియా, మరియు సోషల్ మీడియాలలో విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి గార్ల వాయిస్ లు లీక్ అయినప్పటి సంఘటనల వెనుక కూడా సంధ్యా శ్రీధర్ రావు కీలక పాత్ర పోషించి ఆయా వ్యవహారాలను ysrcp కి చెందిన చింతా ప్రదీప్ కి, మరియు విపరీతంగా మహిళలను అవమాన పరుస్తున్న, దారుణమైన పదజాలంతో ఆడవారిని దూషిస్తున్న ప్రభాకర్ రెడ్డిలకు చేరవేసి తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీయడం ద్వారా హైదరాబాద్ లోని చాలా ఆక్రమిత కట్టడాలకు పర్మిషన్లు తెచ్చుకున్నట్టు వెల్లడైంది.

ఇటీవల సంధ్యా శ్రీధర్ రావు అక్రమ సామ్రాజ్యంపై మీడియా లో వచ్చిన కథనాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించి అక్రమ కట్టడాలను కూల్చి వారి అక్రమాలపై విచారణ చేయవలసినదిగా ఆదేశించింది.

Attempts to create disputes between parties

tdp