చైతుపై వ్యాఖ్యలు-వెనక్కి తగ్గిన వేణుస్వామి
Venu Swamy backtracked on Chaitu commentsనాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకున్న రోజే ఆస్ట్రాలజర్ వేణు స్వామి చైతు-శోభిత పెళ్లి అయ్యాక కలిసుండరు, ఓ అమ్మాయి వల్ల వాళ్ళు విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దానితో వేణు స్వామిపై ఫిలిం జర్నలిస్ట్ లు మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేసారు. దీనిపై వేణు స్వామి కి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన వేణు స్వామి. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పిన హైకోర్టు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన ఉమెన్ కమిషన్.. తాజాగా తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణ చెబుతూ.. హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణు స్వామి..
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వాక్యాలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి.. అంతేకాకుండా ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరిన వేణుస్వామి.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని హెచ్చరించిన ఉమెన్ కమిషన్.
Venu Swamy publicly apologized to the Telangana Women Commission







































