పోసాని పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు

నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
గత ప్రభుత్వంలో జగన్ మెప్పు పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్న పోసానికి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన పోసానికి ఇపుడు కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి.
గత ఏడాది వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో పోసాని మీడియా ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారం చేశారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని.. వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు పోసానిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
A case has been registered against Posani Krishna Murali under various sections
A case registered against Posani Krishna Murali







































