సుకుమార్ ఇంటి పై ముగిసిన ఐటి సోదాలు
IT rides regarding Sukumar endedగత నాలుగైదు రోజులుగా దర్శకుడు సుకుమార్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా వున్న దర్శకనిర్మాతల ఇళ్లపై ఈ రకమైన ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. ఏ ఒక్కరోజో కాకుండా ఏకంగా నాలుగైదు రోజుల నుండి సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై ఈ రకమైన సోదాలు నిర్వహించడంతో పుష్ప ద రూల్ షూట్ పై ఎఫెక్ట్ పడడం అటుంచి మైత్రి మూవీ మేకర్స్ లో ఒకరైన నవీన్ ఎర్నేని హై బీపీతో ఆసుపత్రిలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.
ఆర్థికలావాదేవీలు, జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడడం, లెక్కల్లో చూపని ఆస్తులని కొనుగోలు చెయ్యడమే ఈ దాడులు ప్రధాన లక్ష్యంగా సాగగా.. నిన్న ఆదివారం రాత్రితో సుకుమార్ ఇల్లు, ఆఫీస్ లపై ఐటి అధికారులు సోదాలు ముగించినట్లుగా తెలుస్తుంది. అటు మైత్రి మూవీ మేకర్స్ ఇల్లు, ఆఫీస్ లపై కూడా ఐటి దాడులు ముగిసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్స్, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
IT searches regarding director Sukumar and Mythri Movie makers ended







































