అల్లరి నరేష్ ఈసారి..
Allari Naresh is all set to make his next film with a Tamil directorఅల్లరి నరేష్ తన సినిమాల జోరు తగ్గించాడు. ఇంతకు ముందులా ఏది పడితే అది చెయ్యకుండా, కథలో దమ్ముందా లేదా అని చూస్తున్నాడు. అందుకే తాను చేస్తున్న సినిమాల సంఖ్య ఇప్పుడు తక్కువగా వుంది. ఆ మధ్య రిలీజ్ అయిన నాంది సినిమా చాలా బాగుంది, నరేష్ కి మంచి పేరు వచ్చింది. కానీ అది నిర్మాతకి డబ్బులు తెచ్చిందో లేదో మాత్రం తెలియదు. ఆ సినిమా తరువాత నరేష్ సభకు నమస్కారం అన్న సినిమా చేస్తున్నారు. అయితే నరేష్ ఇప్పుడు ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నారు.
ఈసారి నరేష్ తెలుగు దర్శకుడు కాకుండా తమిళ్ దర్శకుడుతో సినిమా చేస్తున్నారు. రాజా మోహన్ (మోహన్ రాజా కాదు) అని ఒక కొత్త డైరెక్టర్ నరేష్ కి కథ చెప్పాడని, అది నరేష్ కి బాగా నచ్చిందని చెయ్యడానికి అంగీకరించాడని తెలుస్తుంది. నాంది కి డైలాగ్స్ రాసిన ప్రముఖ రచయిత అబ్బూరి, రవి అల్లరి నరేష్ దగ్గరికి ఈ ప్రాజెక్ట్ తీసుకు వచ్చినట్టు కూడా భోగట్టా.
Allari Naresh new film titled Sabhaku Namaskaram







































