తండ్రి కొడుకులకి రీమేక్ పిచ్చి పట్టిందా?
Chiru and Charan eyeing another remakeఈమధ్యన మెగాస్టార్ చిరు ఒరిజినల్ కథలకన్నా ఎక్కువగా రీమేక్ సినిమాలకే సై అంటున్నారు. ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందే ఓ తమిళ రీమేక్ తో. ఆ సినిమాతో హిట్ కొట్టాక సైరా నరసింహారెడ్డి సినిమా చేసినా.. అనుకున్న అంచనాలు ఆ సినిమా అందుకోలేదు. తర్వాత కొరటాల తో స్ట్రయిట్ కథతో ఆచార్య చేసిన చిరు తర్వాత మలయాళ లూసిఫర్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అది ఓకె. ఆ తర్వాత మెహర్ రమేష్ తోనూ తమిళ వేదాళం ని తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నారు చిరు.
ఇక తర్వాత బాబీ తో ఓ సినిమా చెయ్యాల్సి ఉన్న చిరు ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశారని.. దాని కోసం రామ్ చరణ్ ని రంగంలోకి దింపారనే న్యూస్ మొదలైంది. చిరు - చరణ్ లు రీమేక్ లు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. మరి రీమేక్ అంటే సేఫ్ అని తండ్రి కొడుకులు బలంగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు.. అందుకే అలా చేస్తున్నారని, అయినా తండ్రికొడుకులకి రీమేక్స్ పిచ్చిపట్టింది అంటూ ప్రచారము షురూ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అయితే.. చిరు చరణ్ పై మీమ్స్ చూస్తే ఫన్నీగా అనిపిస్తున్నాయి. మరి మీరు పై మీమ్ చూసి హాయిగా నవ్వేసుకోండి.
Megastar Chiranjeevi eyeing another Remake







































