నారప్ప 25 శాతం మంది మాత్రమే చూసారు -ఆర్ నారాయణ మూర్తి

Narappa was watched by only 25%

భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు.. ఓటిటి ప్లాట్ ఫోమ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సన్సేషనల్ కామెంట్స్ చేశారు. విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అయిన నారప్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో  కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు. కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు. మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓ టి టి లేదు.. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం.

సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ థియేటర్ అనుభూతే వేరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నాను. కరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్ సినిమా బతకాలి థియేటర్స్ బతకాలి. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలి. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుంది. థియేటర్ లేకపోతే స్టార్ డమ్ లు వుండవు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓ టి టి కి రిలీజ్ చెయ్యకుండా థియేటర్ లో రిలీజ్ అయ్యే టట్టు చూడాలి.. అని తన ఆవేదన తెలిపారు.

Narappa Movie was watched by only 25% -R Narayana Murthy

narappa movie
ott
venkatesh
r narayana murthy
vijayawada
narayana murthy