ఏపీ సీఎం జగన్ గా స్కామ్ నటుడు?

రాజశేఖర్ రెడ్డి పాద యాత్రని బేస్ చేసుకుని మహి వి రాఘవన్ మలయాళ నటుడు మమ్ముట్టిని రాజశేఖర్ రెడ్డిగా యాత్ర సినిమా చేసాడు. మహి వి ప్రెజెంట్ చేసిన యాత్ర విమర్శకుల సైతం ప్రశంశల వర్షం కురిపించింది. వైఎస్ జీవితాన్ని యాత్ర సినిమాలో సంపూర్ణంగా చూపెట్టారు. ఇక యాత్ర లో రాజశేఖర్ రెడ్డి లైఫ్ ని చూపిస్తే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా యాత్రకి సీక్వెల్ గా యాత్ర 2 ని తెరకెక్కించబోతున్నారు.
రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటినుండి జగన్ పాద యాత్ర, ఓదార్పు యాత్ర, ఆయన సీఎం అవడం అన్ని యాత్ర 2 లో చూపించబోతున్నారట. అయితే జగన్ కేరెక్టర్ లో 1992 – స్కామ్ తో సంచలనం సృష్టించిన ప్రతీక్ గాంథీ కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. 1992 – స్కామ్ వెబ్ సీరీస్ లో హర్షద్ మెహతా కేరెక్టర్ అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చిన ప్రతీక్ జగన్ కేరెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని దర్శకుడు మహి వి రాఘవ ప్రతీక్ గాంథీని సంప్రదించినట్టు సమాచారం. మరి నిజం గానే ప్రతీక్ జగన్ కేరెక్టర్ కి కరెక్ట్ గా సూట్ అవుతాడు.
Yatra seqeuel generates interest
Bollywood actor in Yatra sequel






































