పూరీ ప్రొడక్షన్‌లో ఛార్మీ పెత్తనం!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ మధ్య వున్న బంధం పట్ల గతంలో పలు పుకార్లు షికార్లు  చేశాయి. పూరీ దర్శకత్వంలో ఛార్మీ నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాకు ఛార్మి కూడా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి ఇక నిర్మాతగా వ్యవహరిస్తానని ఛార్మి ప్రకటించింది. అంతేకాదు మొదట్లో ‘లోఫర్’ సినిమాలో నితిన్‌ను హీరోగా అనుకున్నప్పుడు ఛార్మీ వ్యవహరించిన తీరు నచ్చకనే నితిన్ ఆ సినిమా నుంచి వైదొలినట్లుగా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘రోగ్’ చిత్రం ప్రొడక్షన్‌లో కూడా ఆమె నిర్మాతగా పెత్తనం చెలాయిస్తుందని సమాచారం. కాస్ట్ కంట్రోల్‌లో భాగంగా పారితోషికం విషయంలో చార్మీ కఠినంగా వుందని.. పూరీ దగ్గర చాలా కాలం నుంచి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులకు ఆమె వ్యవహారం మింగుడుపడటం లేదని, అందుకే ‘రోగ్’ చిత్రానికి పూరీ పర్మినెంట్  స్టాఫ్ కొంత మంది పనిచేయడం లేదని సమాచారమ్. 

puri jagannadh
charmi
rogue movie
charmi ruling puri
jyothi lakshmi
puri jagannadh staff