ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పూరీ పట్టు ఉడుంపట్టు..!

దర్శకుడు పూరీజగన్నాథ్ అనుకున్నంత పని చేస్తున్నాడు. ‘జ్యోతిలక్ష్మీ’ విడుదల పనులు చూసుకుంటూనే మరోపక్క మెగాస్టార్ చిరంజీవి 150 వచిత్రంపై కసరత్తులు చేస్తున్నాడు. తన సమయాన్ని అందివచ్చిన అవకాశం అయిన చిరు చిత్రంపై తన పూర్తి దృష్టిని కేంద్రీకరించకుండా ఆగష్టు వరకు ఉన్న గ్యాప్లో నితిన్తో సినిమాను ఈ నెలలోనే పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే పూరీ పూర్తి స్క్రిప్ట్ను నితిన్కు నేరేట్ చేసి గ్రీన్సిగ్నల్ పొందాడు. ఈ నెల 15న ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు మొదలయ్యే లోపున పూర్తి చేయాలని సంకల్పంతో పూరీ ఈ డేర్ చేస్తున్నాడు.
poorijagannath
jyothi lakshmi
megastar chiranjeevi
nithin




































