వెంకటేష్‌ చిత్రానికి సెకండ్‌ ప్లేస్‌...!

బుల్లితెరపై పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఓ సంచలనం. ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు వెంకటేష్‌ ‘దృశ్యం’ నిలిచింది. రీసెంట్‌గా టీవీలో ప్రసారమైన ఈ చిత్రం 18.6 రేటింగ్‌ తెచ్చుకుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం 19 రేటింగ్‌ తెచ్చుకుని నెంబర్‌వన్‌ స్దానంలో ఉంది. ‘దృశ్యం’ ముందు వరకు రెండో స్థానంలో ‘అల్లుడు శీను, రేసుగుర్రం’ ఉన్నాయి. ఇప్పుడు ‘దృశ్యం’ చిత్రం సెకండ్‌ ప్లేస్‌కు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా కనెక్ట్‌ కావడంతో ఈ చిత్రానికి ఈ రేటింగ్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో రూపొంది బడ్జెట్‌, బిజినెస్‌పరంగా బాక్సాఫీస్‌ వద్ద భారీగా సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. 

drusyam
venkatesh
second highest rating
family audience