ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'టెంపర్' లో వేలు పెడుతున్నాడట..!

ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక థియేటర్లలో విడుదల కానున్న 'టెంపర్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. అయితే ఈ చిత్రం గురుంచి ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ ప్రసాద్ వి.పొట్లూరి(పివిపి) ఇటీవల ఈ చిత్రాన్ని చూసాడని, కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు పలు సీన్లు తీసేయాలని సూచించాడట. ఈ చిత్రానికి మెయిన్ ఫైనాన్షియర్ అతనే కావడంతో వేరే ఆప్షన్ లేకపోవడంతో పివిపి సూచనల మేరకు దర్శకుడు పూరిజగన్నాథ్, నిర్మాత బండ్లగణేష్ మార్పులు చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆయన మాట వినకపోతే సినిమా విడుదల సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెడతారని బండ్ల గణేష్ భయం. 'ఐ' సినిమాకు ఫైనాన్స్ చేసిన పివిపి విడుదల సమయంలో కోర్టుకు వెళ్లి నిర్మాత, దర్శకులను ఇబ్బందిపెట్టిన సంగతి తెలిసిందే అంటున్నారు.
temper
potluri vara prasad
poori jagannath
bandla ganesh







































