వర్మ మాయలో మంచు ఫ్యామిలీ..!

మంచు ఫ్యామిలీ నటులతో రాంగోపాల్ వర్మ బాగా సింకై పోయాడు. వరుసపెట్టి వారితో చిత్రాలు తీస్తున్నాడు. మంచు విష్ణుతో 'రౌడీ, అనుక్షణం', మోహన్ బాబుతో 'రౌడీ', మంచు లక్ష్మీతో 'డిపార్ట్ మెంట్, దొంగల ముఠా' చిత్రాలు తీసిన ఆయన ఇటీవల మంచు లక్ష్మీ పాదాలపై ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసాడు. ఇక ఆ ఫ్యామిలీ లో మిగిలింది ఒకే ఒక్క హీరో మంచు మనోజ్ మాత్రమే. మంచు మనోజ్ తో కూడా సినిమా తీయడానికి వర్మ స్టోరీ సిద్దం చేసేసుకున్నాడు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించనున్నాడని సమాచారం. మొత్తానికి వర్మ మంచు ఫ్యామిలీని ఏ మాయ చేసాడో తెలియడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

ram gopal varma
manchu family
manchu manoj
24 frames
Advertisement
Advertisement