మహేష్ అభిమానులకు పండగే.. పండగ..!

మహేష్ బాబు బావ సుధీర్ బాబు, నందిత జంటగా లగడపాటి శ్రీధర్ నేతృత్వంలో లగడపాటి శిరీష నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడ చిత్రం 'చార్మినార్'కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నడ ఒరిజినల్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, నాగచైతన్య, రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మహేష్ బాబు కూడా కొన్ని నిమిషాల పాటు వెండితెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం టైటిల్ కు అనుగుణంగా ఈ మూవీ ఆడియో వేడుకను విజయవాడలో ఈనెల 25న జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మహేష్ బాబు వస్తాడని, అందుకోసం అక్కడి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ కు విజయవాడతో అవినాభావ సంబంధం ఉంది. మరి ఇక ఇదే నిజమైతే విజయవాడ మహేష్ అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.

mahesh babu
krishnamma kalipindi iddharini
audio function
vijayawada