బి.గోపాల్ సినిమా ఆగిపోలేదు..!

లారీ డ్రైవర్, బొబ్బిలి రాజా, రౌడీ ఇన్స్పెక్టర్, నరసింహ నాయుడు, ఇంద్ర వంటి అనేక సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్ బి.గోపాల్. తెలుగులో చివరగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా రామ్ హీరోగా నటించిన 'మస్కా'. గోపిచంద్, నయనతార కధానాయకులుగా గోపాల్ దర్శకత్వంలో  సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.. కానీ  కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాల్ని సమకూర్చనున్నారు. గోపీచంద్ 2014 లో 'లౌక్యం' సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'జిల్' మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

b.gopal
ram
maska
gopichand
nayanthara
manisharma
loukyam