ఆడవాళ్లు మీకు జోహార్లు అప్ డేట్

Aadavaallu Meeku Johaarlu update

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, టాప్ హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం పోస్టర్లు, ఒక పాటతోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతోనే ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించిన టైటిల్ సాంగ్‌ను ఈ మధ్యే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న టీజర్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శర్వానంద్, రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి చూపించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.

Aadavaallu Meeku Johaarlu teaser update

sharwanand
rashmika mandanna
tirumala kishore
slvc
aadavaallu meeku johaarlu
aadavaallu meeku johaarlu teaser