కర్ణాటక లోనూ ‘బాహుబలి’ కింగే!

నందమూరి బాలకృష్ణతో ‘లెజెండ్‌’ చిత్రాన్ని నిర్మించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ సాయి కొర్రపాటి చేతికి ‘బాహుబలి’ రైట్స్‌ వెళ్లాయి. రాజమౌళికి సన్నిహితుడైన సాయి కొర్రపాటి ‘బాహుబలి’ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను పొందారు. ‘బాహుబలి’ అన్ని వెర్షన్స్‌ని ఆయనే కర్ణాటకలో విడుదల చేయనున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రదానపాత్రలు పోషిస్తున్న ‘బాహుబలి’ చిత్రం జులై 10వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. 

bahubali
karnataka
sai korrapati
prabhas