లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న సుశాంత్..!

'అడ్డా' సినిమా తర్వాత చాల గ్యాప్ తీస్కున్నాడు సుశాంత్. మద్యలో మేర్లపాక గాంధీ ఓ మంచి కథ చెప్పగా సుశాంత్ అంగీకరించాడు. గాంధీ కి అడ్వాన్సు కూడా ఇచ్చారట. కథ రెడీ అయినప్పటికీ గాంధీ పట్టించుకోకపోవడంతో గాంధీ  శర్వానంద్ దారిలోకి వెళ్ళాడు. 'రన్ రాజ రన్',  'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాల సక్సెస్లో ఉన్న శర్వాతో ఓ సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడు మేర్లపాక గాంధీ.

ఐతే సుశాంత్ కోసం ఓ కథ తయారు చేసాడు జి.నాగేశ్వరరెడ్డి. త్వరలో ఈ సినిమా విశేషాలను నిర్మాణ సంస్థ వెల్లడించనుంది. మంచు ఫ్యామిలీకి దూసుకెళ్త, కరెంటు తీగ వంటి హిట్స్ ఇచ్చిన నాగేశ్వరరెడ్డి సుశాంత్ కి ఏ తరహా కథ రెడీ చేసాడో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రీ నాగ కార్ప్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

hero sushanth
adda hero
sushanth in nageswarareddy direction
sri nag corp new movie