Loading...

విజయ్ ని అరెస్ట్ చెయ్యాలి

ArrestVijay trends as social media

తమిళనాడులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీ కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించగా.. అనేకమంది క్షతగాత్రులు కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జరగడానికి కారణం విజయ్ అంటూ డీజీపీ వెంకటరామన్ ఆరోపిస్తున్నారు. మరోపక్క విద్యార్థి సంఘాలు విజయ్ ని అరెస్ట్ చెయ్యాలని ఆందోళన చేపట్టాయి. 

ఈ ఘటన జరగకముందు విజయ్ నిన్న శనివారం మద్యాన్నం 12 గంటలకు ర్యాలీ అని చెప్పి 10 వేల మంది ర్యాలీకి అనుమతి తీసుకోగా.. విజయ్ ఆరు గంటల ఆలస్యంగా సాయంత్రం 7 గంటలకు ర్యాలీ కి వచ్చేసమయానికి అక్కడికి 30 నుంచి 40 వేల మంది పోగయ్యారు. దానితో ఈ ర్యాలీ లో విజయ్ మాట్లాడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగిపోయింది. ఈ ఘటన తర్వాత విజయ్ కరూర్ నుంచి చెన్నై కి వెళ్లిపోయారు. 

కరూర్ తొక్కిసలాట ఘటన తన మనసును కలిచివేసింది అని, ఈ బాధను భరించలేకపోతున్నట్లుగా విజయ్ సోషల్ మీడియా వేదికగా ఈ తొక్కిసలాటలో మరణించినవారికీ 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ఇంటి దగ్గర బందోబస్తు పెంచేశారు. విజయ్ ను అరెస్ట్ చెయ్యాలంటూ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. మరి ఈ ఘటన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

Arrest Vijay trends as social media erupts over Karur rally

vijay