Loading...

ఆ నలుగురి గెలుపు భారీ మెజారిటీతో..

Those four won with a huge majority

మే 13 న ఎన్నికలు పూర్తి కాగా.. రెండు తెలుగు రాష్ట్రల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేడు జూన్ 1 సాయంత్రం విడుదలయ్యాయి. కొద్దిరోజులుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసి సస్పెన్స్ కి తెర దించాయి సర్వే సంస్థలు. ప్రస్తుతం సోషల్ మీడియా, అలాగే ఛానల్స్ లో ఎక్కడ చూసినా ఇండియాలోని ఎలక్షన్ జరిగిన పలు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ తో మార్మోగిపోతున్నాయి. 

అందులో ఎంతోమంది ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ మొదలయ్యింది. అందులో ఆరా మస్తాన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారితో గెలవబోతున్నట్టుగా ప్రకటించారు. మరోపక్క చంద్రబాబు కూడా భారీ మెజారిటీతో గెలబోతున్నట్టుగా ఆరా మస్తాన్ చెప్పారు. 

ఇక లోకేష్ మంగళగిరిలో గెలబోతున్నట్టుగా చెప్పిన ఆరా మస్తాన్.. హిందూపురంలో మంచి మెజారిటీతో బాలకృష్ణ గెలబోతున్నట్టుగా చెప్పారు. 

అయితే ఏపీ ఎన్నికల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది అన్న ఆరా మస్తాన్.. కూటమి 71 నుంచి 81 స్తానాలు  గెలుస్తుంది అంటూ తేల్చేసారు. 

AARA Exit Poll Survey Results On AP Elections

aara exit poll survey