రష్మిక సంతోషం చూసారా..
Rashmika Comes On Board For Dhanush Filmరష్మిక మందన్న ఆనందం చూస్తే అబ్బో అంటారు. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన రశ్మికకి హిందీ, తమిళ్ వరసగా ఝలక్ లిస్తున్నాయి. తమిళనాట విజయ్ తో కలిసి వారిసు తో ఓ హిట్ కొడదామనుకుంటే అది రష్మికని బాగా డిస్పాయింట్ చేసింది. రిజల్ట్ విషయం పక్కనబెడితే ఆ చిత్రంలో రష్మిక డమ్మీ కేరెక్టర్ లో కనిపించింది. ఇక అంతకుముందే కార్తీ సుల్తాన్ తో బిగ్గెస్ట్ ప్లాప్ ఇచ్చాడు.
ఈ మద్యన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రష్మిక రొమాన్స్ చేయబోతుంది అనే వార్తల నేపథ్యంలో ఆ సినిమాపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ధనుష్ 50 లోకి రశ్మికకి వెల్ కమ్ చెబుతూ ఇచ్చిన అప్ డేట్ తో రశ్మిక తెగ సంతోష పడిపోతుంది. Beginning of a new journey.💃🏻❤️#D51 న్యూ జర్నీ అంటూ ఆనందంతో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ధనుష్ తో రష్మిక హీరోయిన్ గా కన్ ఫామ్ అవ్వగా ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇదో మల్టీస్టారర్ గా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది. అందుకే రష్మిక అంతగా ఎగ్జైట్ అవుతుంది.
Rashmika Mandanna Comes On Board For Dhanush, Sekhar Kammula Film






































