పాపం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాగా ఇరుక్కుంది
Jacqueline Fernandez Laundered Money, Says Enforcement Directorateశ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పటికే ఈడీ సమన్లతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సుఖేశ్ చంద్రశేఖర్ కేసు లో ఇప్పటికే జాక్వలిన్ పలుమార్లు ఈడీ విచారణ ఎదుర్కొంది. సుఖేశ్ చంద్రశేఖర్ ని అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అతను ఢిల్లీ జైలులో వున్నాడు. సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్టు గతంలో జాక్వలిన్ ఇది విచారణ లో ఒప్పుకుంది కూడా. గతంలో సుఖేష్ నుండి పది కోట్ల బహుమతులు జాక్వలిన్ అందుకున్నట్టుగా చెప్పగా.. అప్పుడే ఆమె నుండి ఏడు కోట్లు రికవర్ కూడా చేసారు.
ఇక ఇప్పుడు 215 కోట్ల దోపిడీ కేసులో ఆమెను సైతం నిందితురాలిగా చేర్చడమే కాకుండా.. ఆమెకు వ్యతిరేకంగా చార్జ్ షీటును బుధవారం కోర్టులో దాఖలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్యను 215 కోట్లకు దోపిడీ చేసిన కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ నిందుతుడిగా ఉండగా. ఇప్పుడు ఆ కేసులు జాక్వలిన్ పేరు చేర్చడంతో ఆమె మరింత చిక్కులో పడింది.
Jacqueline Fernandez named as accused by Enforcement Directorate in money-laundering case







































