విశాల్, కార్తీ లకి బెదిరింపులు

కోలీవుడ్ స్టార్ హీరోస్ విశాల్ ని కార్తీని చంపేస్తామంటూ ఓ ఆర్టిస్ట్ బెదిరించడం కోలీవుడ్ లో కలకలం రేపింది. ప్రస్తుతం విశాల్, కార్తీ లు సినిమాలు మాత్రమే కాకుండా నడిగర్ సంఘంలో కీలక పదవుల్లో ఉన్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ ఉండగా, కార్యదర్శిగా విశాల్, మరో కీలక పదవిలో కార్తి కొనసాగుతున్నారు. అయితే విశాల్, కార్తీపై ఆర్టిస్ట్ రాజా దురై ద్వేషం పెంచుకోవడమే కాకుండా.. వీరిద్దరిని చంపేస్తానంటూ బెదించడంతో.. నడిగర్ సంఘానికి చెందిన అధికారి ధర్మరాజ్ ఈ ఘటనపై తేనం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా విశాల్, కార్తీలను అవమానించేలా రాజాదురై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ కేసుని నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Actors Vishal and Karthi are getting death threats
Threats To Heroes Vishal, Karthi







































