నెక్స్ట్ మిషన్ స్టార్ట్ అంటున్న విజయ్-పూరి

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ ఈమధ్యనే పూర్తయ్యింది. లైగర్ మూవీ ని ఏకంగా ఆగష్టు 25 న రిలీజ్ చేస్తున్నట్లుగా టీం ప్రకటించింది. దానితో రౌడీ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. అయితే లైగర్ మూవీ రిలీజ్ కి 4 నెలలు టైం ఉండడంతో ఈ లోపులో పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనులు చూసుకుంటారేమో అనుకుంటే.. ఈ హీరో- దర్శకుడు కలిసి కొత్త సినిమా ప్లాన్ చేసుకున్నారు. అది కూడా పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన ని విజయ్ దేవరకొండ హీరోగా పూరి త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్టుగా అనుకుంటున్నారు.
అయితే ఎప్పుడో కాదు అది రేపు మార్చ్ 29 నే నెక్స్ట్ మిషన్ లాంచ్ అంటూ ప్రకటించారు. రేపు మంగళ వారం విజయ్ - పూరి ల తదుపరి ప్రాజెక్ట్ ఓపెనింగ్ తో పాటుగా వివరాలను వెల్లడించబోతున్నారు. దానికి టైం కూడా ఫిక్స్ చేసారు. నెక్స్ట్ మిషన్ టుమారో అంటూ 14:20 గంటలు- 19.0760° N, 72.8777° E - తదుపరి మిషన్ ప్రారంభం 29-03-2022.. అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. మరి విజయ్ - పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ జన గణ మన అనేది తెలుసుకోవాలని అటు ఫాన్స్ తో పాటు దానిని రిజెక్ట్ చేసిన హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు.
Vijay Deverakonda and maverick director Puri Jagannadh will be collaborating for another project
Vijay Deverakonda, Puri Jagannadh Next Mission Launch



































