యుటివి కి 'శ్రీమంతుడు' దెబ్బ!

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం అద్బుమైన విజయం దిశగా సాగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రిమూవీస్‌తో కలిసి మహేష్‌బాబు స్వయంగా నిర్మించాడు.  ఈచిత్రం రైట్స్‌ను ఈరోస్‌ సంస్థ సొంతం చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను మొదట యుటివి నిర్మించాలని భావించింది. కానీ అగ్రిమెంట్లు, యుటివి నిబంధనలు నచ్చని మహేష్‌ ఈ ప్రాజెక్ట్‌ నుండి బయటకు వచ్చి ఈ సినిమా చేశాడు. తమకు ఈ సినిమా నిర్మించే చాన్స్‌ మిస్‌ చేసుకోవడంతో పాటు తమ ప్రత్యర్థి అయిన ఈరోస్‌ ఈచిత్రం ద్వారా మంచి లాభాలను గడించడం యుటివికి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి అందరూ ఆయ్యో..పాపం.. యుటివి అంటున్నారు. 

utv
srimanthudu
eros
mahesh babu