ఫ్యామిలీతో మహేష్ ఎంజాయ్మెంట్

మహేష్ బాబు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఆయన తల్లి ఇందిరా దేవి గారి మరణం తర్వాత అన్ని కార్యక్రమాలు ముగించుకుని.. మహేష్ బాబు ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన SSMB28 సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అవుతారనుకుంటే ఆయన తన భార్య నమ్రత, పిల్లలు తో కలిసి లండన్ వెళ్లారు. లండన్ లో కాస్త రిలాక్స్ అయ్యి మహేష్ హైదరాబాద్ కి తిరిగి రాబోతున్నారు. మహేష్ హైదరాబాద్ కి రావడం రావడం త్రివిక్రమ్ తో కలిసి SSMB28 సెట్స్ లోకి జాయిన్ అవుతారు.
ఇప్పటికే ఓ షెడ్యూల్ ముగించుకున్న SSMB28 రెండో షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో మొదలు కాబోతుంది. అయితే లండన్ లో మహేష్ తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని ఆయన భార్య నమ్రత కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నమ్రత సెల్ఫీలు తీస్తూ ఉండగా.. గౌతమ్, సితార, మహేష్ లు అదిరిపోయేలా ఫొటోలకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mahesh Holidaying With Family In London
Pics From Mahesh Latest Holiday With Family







































