అడివి శేష్ కి కరోనా: మిస్ అవుతున్నా అంటూ ట్వీట్

యంగ్ హీరో అడివి శేష్ మేజర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టి ఆయన తదుపరి చిత్రం హిట్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా అడివి శేష్ తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ట్వీట్ చేసాడు. అంతేకాకుండా తనకి కరోనా రావడం వలన రెండిటిని మిస్ అవుతున్నా అంటూ ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలపై శేష్ ట్వీట్ చేసాడు. నా ఫ్రెండ్స్ కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, దుల్కర్, మృణాల్ ఠాకూర్, సుమంత్ నటించిన సీతారామం మూవీస్ బాగున్నాయని టాక్ వినిపిస్తుంది.
నేను ఆ రెండు సినిమాలకు వెళ్ళేలేకపోతున్నా, కరోనా కారణముగా ప్రస్తుతం నేను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను, ఈ రెండు సినిమాలకు పాజిటివ్ రావడం చూసిన అడివి శేష్ ఇది కదా మనకు కావాల్సింది.. నా పేరు చెప్పి ఉదయం ఒక ఆట, మ్యాట్నీ రెండూ కుమ్మెయ్యండి అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే అడివి శేష్ కి కరోనా వచ్చింది అని తెలియగానే ఆయన ఫాన్స్ లో చిన్నపాటి ఆందోళన మొదలైంది.
Adivi Sesh tested positive for Covid-19 and is in isolation
Adivi Sesh tests positive for Covid-19








































