అది మాటలకి అందని విషాదం.. పవన్

పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఫ్లెక్సీ బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మరణించిన వార్త అందరినీ తీవ్రంగా కలచివేసింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం 13మందికి షాక్ తగలగా ముగ్గురు మరణీంచారు. ఇంకా నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఐతే తన పుట్టినరోజు వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు. మాటలకి అందని విషాదం అంటూ ఈ ఘటన తన మనసుని బాగా కలచి వేసిందని అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి దూరమైన బిడ్డలని తీసుకురాలేనని, కానీ వారిని ఒక కొడుకుగా ఉంటానని, ఆర్థికంగా ఆ కుటుంబాలని ఆదుకుంటానని చెప్పారు. ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభిమానులకి మెరుగైన వైద్యం అందిస్తానని, వారికి ఎలాంటి అవసరం ఉన్నా తక్షణమే అందించాలని స్థానికి జనసైనికులకి పిలుపినిచ్చారు.
Pawan Kalyan words about tragic moment..
Pawan Kalyan words about tragic moment..







































