‘ఇద్దరి లోకం ఒకటే’ విడుదల ఎప్పుడంటే?

నవంబర్ రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’
యంగ్ హీరో రాజ్తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీ.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 90 శాతం సినిమా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్, పృథ్వీ, రోహిణి, భరత్, సిజ్జు, అంబరీష్, కల్పలత తదితరులు
సాంకేతిక వర్గం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీఆర్.కృష్ణ
సమర్పణ: దిల్రాజు
నిర్మాత: శిరీష్
కెమెరా: సమీర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: తమ్మి రాజు
డైలాగ్స్: అబ్బూరి రవి
పాటలు: శ్రీమణి, కిట్టు, బాలాజీ
స్టంట్స్: స్టంట్ శివ
కొరియోగ్రఫీ: భాను, విజయ్
Iddari lokam Okate Movie Release in November
Iddari lokam Okate Movie Release Details







































