మరో వివాదాస్పద సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు!

ఇటీవల విడుదలైన 'బాహుబలి, భజరంగీభాయిజాన్‌' చిత్రాలకు కథలను అందించి ఈ రెండు సూపర్‌సక్సెస్‌ కావడంతో రచయిత,రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే ఆయన ఇప్పటికీ అదే ఖుషీ మూడ్‌లో ఉన్నాడనుకుంటే పొరపాటే. ఆయన ప్రస్తుతం మరో సూపర్‌ సబ్జెక్ట్‌ను రెడీ చేయడంలో బిజీగా ఉన్నాడు. బాబ్రీ మసీద్‌ వివాదం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నట్లు సమాచారం. సెన్సార్‌ బోర్డ్‌ అధికారి షెహనాజ్‌ నిహాలానీతో కలిసి ఆయన ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. బాబ్రీ మసీద్‌ సంఘటన తర్వాత ఓ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రం స్క్రిప్ట్‌ను చెక్కుతూ, అందులో నిమగ్నమై ఉన్నాడు. 

vijayendhraprasad
bahubali
bajarangi bhaijaan