గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నాని శ్యాం సింగ రాయ్ టీం
Shyam Singha Roy team accepted Green India Challengeరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన హీరో నాని,హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్...
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.సినిమా ఇండస్ట్రీ,రాజకీయ నాయకులు ఇలా అందరూ పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమం ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని నాని అన్నారు.గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు...
కార్యక్రమం అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ కరుణాకర్ రెడ్డి,రాఘవ వృకవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు.ప్రకృతి పై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు
Shyam Singha Roy team accepts Hara Hai Toh Bhara Hai Greenindia Challenge







































