శ్రీకాంత్ 'మరణమృదంగం' లో హీరోయిన్ గా పటాస్ ఫేమ్ శృతిశోది!
Patas Heroine in Srikanth Marana Mrudangamహరిప్రియ మూవీస్ బ్యానర్ పై, మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో డాక్టర్ కుంచపురమేష్ నిర్మాతగా, వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మరణమృదంగం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ కుంచపురమేష్ మాట్లాడుతూ...
మరణమృదంగం చిత్రంలో హీరో శ్రీకాంత్ కు జోడిగా హిరోయిన్ (పటాస్ ఫేమ్) శృతిశోది ఖరారు అయ్యింది. శ్రీకాంత్ యాక్షన్ రివేంజ్ పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీ నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లబోతొంది. ఇదొక మంచి కథ, శ్రీకాంత్ కు బాగా సెట్ అయ్యే కథ ఇది, ఈ సినిమాతో శ్రీకాంత్ కు మంచి బ్రేక్ లభిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్లు దర్శకుడు వెంకటేష్ రెబ్బ ఈ సినిమాను తీస్తున్నారు. మేము ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నాము అన్నారు.
Shruti Sodhi in Hero Srikanth New film Marana Mrudangam






































