సినీనటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఎంత డ్రామా నడిచిందో అనేది అందరికి తెలిసిందే. జూన్ 1 న జరిగిన ఈ ఇష్యు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో హేమ తన శాంపిల్స్ పోలీసులకు ఇచ్చి బెంగుళూరు వెళ్లి విచారణకు కూడా హాజరైంది.
హేమ మొదటి నుంచి తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదు, తాను బర్త్ డే పార్టీకి వెళ్ళాను, నేను డ్రగ్స్ తీసుకోలేదు, మీడియా కావాలనే నన్ను ఇరికించింది అని చెబుతూ వచ్చింది. మరోపక్క పోలీసులు హేమ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం, బెయిల్ పై ఉన్న హేమకు మా అసోసిషియన్ కూడా నోటీసులు ఇచ్చింది.
హేమ కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారణ అవడంతో హేమకు పోలీసులు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విధించిన నిషేధాన్ని కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానితో హేమ కథ సుఖాంతం అయినట్లే కదా.!