బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్న అనసూయ

కొద్దిరోజులుగా భర్త భరద్వాజ్, పిల్లలతో సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటొస్ ని సోషల్ మీడియాలో వదులుతూ రచ్చ చేసిన అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం వెండితెర మీద పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. వెండితెర కి ఎంట్రీ ఇవ్వకముందు అనసూయ జబర్దస్త్ కామెడీ షో తో బుల్లితెర ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
కొన్నేళ్లపాటు గ్లామర్ యాంకర్ గా అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకున్న అనసూయ ఆ తర్వాత పలు ఛానల్స్ లో యాంకర్ గా పని చేస్తూ వెండితెర అవకాశాలు అందిపుచ్చుతుంది. వెండి తెర మీద బిజీ అవడమే, లేదంటే జబర్దస్త్ కావాలని అనసూయ వదిలెయ్యడమా అనేది క్లారిటీ లేకపోయినా.. అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుని బుల్లితెర ఆడియన్స్ కి బిగ్ షాకిచ్చింది.
ఆ తర్వాత స్టార్ మాలో కనిపించినా.. గత రెండేళ్ళుగా అనసూయ బుల్లితెరకి దూరంగా ఉంటుంది. తాజాగా అనసూయ మరోసారి బుల్లితెర మీదకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ రియాలిటీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ షోకి సంబందించిన కిర్రాక్ లుక్ ని అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Anasuya Bharadwaj re entry into small screen with Kiraak show details
Anasuya Bharadwaj re entry into small screen







































