అఫీషియల్: గీత గోవిందం 2

గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ - పరశురామ్ లు మరో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా గీత గోవిందం 2 గా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు దిల్ రాజు దీనిని కన్ ఫర్మ్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మొదటిసారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలని ఈ రోజు అధికారికంగా ప్రకటించడంతో పాటుగా.. దిల్ రాజు-విజయ్ దేవరకొండ-పరశురామ్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్న పిక్ ని రిలీజ్ చేసారు. దీనికి సంబందించిన ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు.
Vijay Deverakonda Collaborating with Parasuram, Dil Raju and Shirish to produce under SVC Creations Banner
Vijay Deverakonda Collaborating with Parasuram, Dil Raju






































