కాంతార టీమ్ కి కోర్టు షాక్
Kantara In Legal Troubleకన్నడలో సంచలన విజయాన్ని నమోదు చేసి.. పర భాషల్లోనూ కన్నడకన్నా ఎక్కువ విజయాన్ని మూటగట్టుకుని.. నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తున్న కాంతార పై ప్రముఖులు ప్రశంశలు కురిపిసితుంటే.. వాటిని ఎంజాయ్ చేస్తున్న కాంతార టీమ్ కి కోర్టు షాకిచ్చింది. సూపర్ హిట్ అయిన కాంతార క్లైమాక్స్లో కోల చెప్పే వ్యక్తిగా హీరో రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూపించారు. ఆ సమయంలో వచ్చే వరాహ రూపం సాంగ్ ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింది.
వరాహ రూపం అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారని తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపించడమే కాకుండా వారు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టు కెక్కారు. కేసుని పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు కాంతార మేకర్స్కి బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే కాంతారలో వరాహ రూపం సాంగ్ ని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. కోర్టు ఆర్డర్స్తో మెయిన్ ఫ్లాట్ ఫామ్స్లో వరాహ రూపం పాటను నిలిపి వేయబోతున్నారు కాంతార మేకర్స్.
Court Order Against Kantara Makers






































