ఆ విషయంలో శిల్పా శెట్టి దంపతులకు ఊరట
Raj Kundra Case: No need for action in that regardబాలీవుడ్ లో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బ్లు ఫిలిమ్స్ చిత్రీకరణ కేసులో అరెస్ట్ అవ్వడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా కి ఆయన ఫ్యామిలీకి ముంబై పోలీస్ లు చుక్కలు చూపెడుతున్నారు. శిల్పా శెట్టి ఇంట్లో సోదాలు, ఆయన బ్యాంక్ ఎకౌంట్స్ సీజ్ చెయ్యడం, శిల్ప శెట్టి ని విచారించడం.. అన్ని బాలీవుడ్ లో ఆసక్తిని కలగజేస్తుంటే.. శిల్ప శెట్టి మాత్రం కన్నీరు మున్నీరు అవుతుంది. ఇక మీడియా మీద కూడా శిల్పా శెట్టి ఫైర్ అవడమే కాదు, కోర్టుకి వెళ్ళింది. ఇక ప్రస్తుతం రాజ్ కుంద్రా కేసు కోర్టు విచారణలో ఉంది.
రాజ్ కుంద్రా కి సంబందించిన పలు వ్యాపారలావాదేవిలను, ఆయన ఆస్తులపైన పోలీస్ లు విచారణ చేపట్టారు. ఈ కేసుతో పాటుగానే రాజ్ కుంద్రా పై ఉన్న మరికొన్ని కేసులపై విచారణ కూడా జరుగుతుంది. అయితే ఓ కేసులో రాజ్ కుంద్రా - శిల్పా శెట్టి దంపతులకి కాస్త ఊరట లభించింది. బ్లు ఫిలిమ్స్ కేసుల్లో విచారణ చేపట్టిన ముంబై పోలీస్ లు, కోర్టు విచారంతో శిల్పా శెట్టి దంపతుల్లో ఒత్తిడి పెరుగుతుండగా.. అందులో భాగంగానే షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణకు రాగా.. ఆ కేసు విషయంలో సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ విషయంలో శిల్పాశెట్టి దంపతులు ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయ్యింది. దానితో శిల్పా శెట్టి దంపతులకు ఆ కేసులో ఊరట లభించింది.
Shilpa Shetty couple did nothing wrong in that regard






































